Chandrababu Comments on CM Jagan in Kakinada Election Campaign: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కాకినాడ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు సంబంధించిన బినామీ ఇక్కడే ఉన్నాడని.. ఆ ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కు సవాల్ చేస్తున్నాడని.. ఖబర్దార్ జాగ్రత్త.. ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడు అంటూ ప్రశంసించారు.
పొత్తులో మూడు పార్టీలు త్యాగం చేశామని, మీ కోసమే పొత్తు పెట్టుకున్నామని.. మీరు వేసే ఓటు జగన్ గుండెల్లో దిగాలన్నారు. తమ మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో అని.. జగన్ మేనిఫెస్టో వెల వెల పోయిందన్నారు. ఇది క్లాష్ వారు కాదు.. క్యాష్ వార్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్ అమలులోకి తెచ్చి.. మీ ఆస్తులకు జిరాక్స్ లు ఇస్తాడన్నారు. నీ భూమి అమ్మాలంటే వాడి పర్మిషన్ ఏంటి అంటూ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చినంక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామన్నారు.
Also Read: ఫ్యాన్ గాలికి హామీలు కొట్టుకుపోయాయ్: వైఎస్ షర్మిల
రానున్న ఐదేళ్లు కాపుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. అదేవిధంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విషయానికి సంబంధించి గతంలో తాము సుప్రీంకోర్టులో పోరాడమంటూ గుర్తు చేశారు. ప్రజలు, ఉద్యోగులు, వృద్ధులు ఆలోచించి రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలన్నారు.