E-Paper
Advertisement

Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త

Ananthapuram: అనంతపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో వేట కొడవలితో నరికి చంపిన భర్త
Advertisement

Ananthapuram: కంటికి రెప్పలా కాపాడుతానని మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచిన భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని, అత్యంత దారుణంగా సొంత ఇంట్లోనే వేట కొడవలితో నరికి చంపాడు. ఈ ఘోర సంఘటన అనంతపురం జిల్లా బెలగుప్ప మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. బెలగుప్పలో నివాసం ఉంటున్న ఆంజనేయులు, శాంతి దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఎనిమిదో తరగతి చదివే కొడుకు, ఆరో తరగతి చదివే కూతురు ఉన్నారు. ఇంతకాలం వీరి కాపురం సజావుగానే సాగుతున్నట్లు కనిపించినా, గత కొంతకాలంగా వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ భర్త ఆంజనేయులు తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలోనే గురువారం ఇంట్లో భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపంతో విచక్షణ కోల్పోయిన ఆంజనేయులు, ఇంట్లోనే భార్యపై వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఆమెను అత్యంత కిరాతకంగా నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో శాంతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

భార్యను చంపిన అనంతరం, ఆంజనేయులు నేరుగా బెలగుప్ప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే తానే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ఎదుట నిందితుడు ఆంజనేయులు నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

Advertisement

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×