E-Paper
Advertisement

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం
Advertisement

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూనే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఇంధన సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడం కాకుండా, కలెక్టర్లు, ఉన్నతాధికారులు నేరుగా ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. రవాణాలో అడ్డంకులు తొలగించి, ట్యాంకర్లు సకాలంలో గమ్యస్థానాలకు చేరేలా చూడాలని పేర్కొన్నారు.

Advertisement

ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఆర్టీజీ (RTG) సెంటర్‌ను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ కొరత ఉంది? ఏ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది? అనే అంశాలపై ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక అందించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కొందరు స్వార్థపరులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు పాల్పడే అవకాశం ఉందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను హెచ్చరించారు.

ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ, స్టాక్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ చొరవతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×