E-Paper
Advertisement

వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!
Advertisement

Vietnam Boat Accident: వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విహారయాత్ర కోసం వెళ్లిన మన రాష్ట్ర ప్రజలు అక్కడ ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న సమాచారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది.

రంగంలోకి దిగిన మంత్రి లోకేష్

Advertisement

ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా మాట్లాడారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి, ప్రమాద తీవ్రత, అక్కడ అసలేం జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: వియత్నాంలో ఘోర ప్రమాదం.. సముద్రంలో బోల్తా పడిన బోటు.. 18 మంది భారతీయ పర్యాటకులు మృతి!

Advertisement

రాయబార కార్యాలయంతో సంప్రదింపులు

ఆంధ్రప్రదేశ్ నుంచి వియత్నాంకు టూరిస్టుగా వెళ్లిన కొందరు పర్యాటకులు ఈ బోటు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు మంత్రి లోకేష్‌కు ప్రాథమిక సమాచారం అందించారు. ఈ క్రమంలో బాధితులను సురక్షితంగా రక్షించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ)తో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

తక్షణ సహాయానికి ఆదేశాలు

బాధితులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, వారిని క్షేమంగా సొంత ఊర్లకు చేర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, బాధితులకు అవసరమైన వైద్య, ఇతర అత్యవసర సహాయాన్ని తక్షణమే అందేలా చూడాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో బాధితుల కుటుంబాల్లో కాస్త భరోసా లభిస్తోంది.

Also Read: స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

Related News

అత్తమామలను కారుతో తొక్కించేసిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బూతు పోస్టులు పెడితే తాట తీస్తారు! ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్!

మన అరకు ‘మంకీ కాఫీ’కి ఎందుకంత డిమాండ్? కోతులకు సంబంధం ఏమిటీ?

పరిహారం లేదు.. కనికరం లేదు.. తాడేపల్లిలో కన్నీరు పెడుతున్న రైతన్నలు.. బలవంతంగా భూముల స్వాధీనం!

తిరుపతిలో ‘మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్శిటీ’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

MBBS Seats Increase: మెడికల్ విద్యార్థులకు తీపి కబురు.. 100 ఎంబీబీఎస్ సీట్లు పెంపు, సీట్లు ఓకే సౌకర్యాల మాటేంటి?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స.. అసలేమైంది? డాక్టర్లు ఏం చెప్పారు?

Big Stories

Advertisement
×