E-Paper
Advertisement

ఎన్‌టీపీసీలో 114 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ఎన్‌టీపీసీలో 114 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Advertisement

NTPC Green Energy recruitment 2026: మహారత్న కంపెనీ అయిన ఎన్‌టీపీసీ (NTPC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 114 అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. జులై 11 నుంచి ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. కాబట్టి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి కేటగిరీల వారీగా చూస్తే..

Advertisement

అసిస్టెంట్ ఇంజినీర్ (AE – E0 గ్రేడ్): 100 పోస్టులు (ఓపెన్ కేటగిరీ-41, ఓబీసీ-27, ఎస్సీ-15, ఈడబ్ల్యూఎస్-10, ఎస్టీ-07)

డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM – E6 గ్రేడ్): 14 పోస్టులు,(ఓపెన్ కేటగిరీ-08, ఓబీసీ-03, ఎస్సీ-01, ఎస్టీ-01, ఈడబ్ల్యూఎస్-01)

అర్హతలు:

Advertisement

అసిస్టెంట్ ఇంజినీర్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థుల గరిష్ట వయస్సు 44 ఏళ్లు మించకూడదు.

డిప్యూటీ జనరల్ మేనేజర్: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ (B.E/B.Tech) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో.. ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ట వయస్సు 40 ఏళ్లు మించకూడదు.

జీతం:
అసిస్టెంట్ ఇంజినీర్: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది.

డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ.90,000 నుంచి రూ.2,40,000 వరకు భారీ జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లను మొదట స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత పోస్టులను బట్టి రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జులై 11
చివరి తేదీ: జులై 31

అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Related News

1000 రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సీ ఓటర్ సర్వేతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకు.. తెలంగాణలో 8-10 ఎంపీ సీట్లు బీజేపీవేనా?

గద్వాల్ మార్కెట్ యార్డులో భారీ గంజాయి కలకలం

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

హాస్పిటల్ క్వార్టర్స్‌లో దారుణం.. 21 ఏళ్ల నర్స్ దారుణ హత్య?

Big Stories

Advertisement
×