E-Paper
Advertisement

Botsa Satyanarayana : మంత్రి బొత్సకు నిరసన సెగ.. వాహనాన్ని అడ్డుకున్న అంగన్వాడీలు..

Botsa Satyanarayana : విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని మంత్రికి అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. సరిపోని జీతాలతో కుటుంబం పోషించడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించం దారుణమన్నారు.

Botsa Satyanarayana : మంత్రి బొత్సకు నిరసన సెగ..  వాహనాన్ని అడ్డుకున్న అంగన్వాడీలు..
Advertisement

Botsa Satyanarayana : విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని మంత్రిని కోరారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని మంత్రికి అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. చాలిచాలని జీతాలతో కుటుంబం పోషించడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించం దారుణమన్నారు.

Advertisement

అంగన్వాడీ కార్యకర్తలు వినతిపై మంత్రి బొత్స స్పందించారు. అంగన్వాడీ డిమాండ్ ల్లో వేతనం పెంపు తప్ప అన్ని డిమాండ్ లు నేరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీతాలు కంటే తమ ప్రభుత్వం అధికంగానే వేతనాలు ఇస్తోందన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె వల్ల బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని సార్లు సమ్మె విరమించమని విజ్ఞప్తి చేసినా అంగన్వాడీలు పట్టించుకోలేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. సమ్మెను విరమించిన మరుక్షణమే ఎస్మా రద్దు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×