E-Paper
Advertisement

Adi Narayana Reddy: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

Adi Narayana Reddy: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
Advertisement

Adi Narayana Reddy comments on Jagan(AP Politics): ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 5 లక్షల కోట్లు స్వాహా చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా వైసీపీ చేసిన అక్రమాలు, కబ్జాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. వాటి గురించి ప్రజలను మరల్చేందుకు వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైసీపీ కూడా అదే పరిస్థితికి వస్తుందని విమర్శించారు. మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీకి చెందిన నేతలు అనేక మంది వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. దస్త్రాల దహనం, కాలువలో పారేయడం వంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని అన్నారు.

Advertisement

Also Read: జగన్ రేషన్..బాబు పరేషాన్

జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. అంతే కాకుండా వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం లేదని విమర్శించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×