BigTV English

CBN Serious on jagan Over Security: పరదాలు కట్టుకుని తిరిగే సీఎంకు 986 మందితో భద్రతనా..?: చంద్రబాబు

CBN Serious on jagan Over Security: పరదాలు కట్టుకుని తిరిగే సీఎంకు 986 మందితో భద్రతనా..?: చంద్రబాబు

Chandrababu Serious on Jagan(Andhra politics news): ఏపీలో రాజకీయ నేరస్థులకు ఎక్కువగా భద్రత ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక ముఖ్యమంత్రికి 986 మందితో భద్రతనా? అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకర్లు.. మాజీ సీఎం జగన్ భద్రతకు సంబంధించిన అంశంపై చంద్రబాబును ప్రశ్నలు అడిగారు. వెంటనే ఆయన స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు.


‘ఒక సీఎం భద్రతకు 986 మంది సిబ్బంది కావాలా..? అదీ పరదాలు కట్టుకుని తిరగడానికి..! ఇప్పుడు మేం వెళ్లినా కూడా పరదాలు కట్టేస్తున్నారు. ఏంటయ్యా ఇది అని అధికారులను అడిగితే అలవాటైపోయింది సర్ అని అంటున్నారు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడమేంటి..? అవసరమైన మేరకే ట్రాఫిక్ ను ఆపాలని నేను చెబుతున్నాను. నాకు రెండు నిమిషాలు లేటైనా ఫర్వాలేదు.. నేను నిలబడుతా. వాళ్లంతా వెళ్లాకే వెళ్దామని చెబుతున్నాను. ఎక్కడా కూడా ఎక్కువ టైం ఆఫ్ చేయొద్దని మంత్రులకు, కేబినెట్ సమావేశంలోనూ చెప్పాను. ఎలాంటి ఆర్భాటాలూ వద్దని చెప్పాను. మనమేం రాజులం కాదు.. డిక్టేటర్లం కాదు.. ఇష్టానుసారం చేయడానికి. ప్రజాసేవకులుగా ప్రవర్తించాలంటూ వారికి సూచిస్తున్నా’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

ఇటు పోలవరం విషయంలో కూడా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు నిర్లక్ష్యం వల్ల పోలవరం నిర్మాణం ఆగిపోయిందన్నారు. కాంట్రాక్టర్లను మార్చి.. నిధులను విడుదల చేయకుండా.. సరైనా అధికారులను బదిలీ చేసి.. చివరకు పోలవరంను పూర్తి చేయలేదన్నారు. కేంద్రసహాయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణ విషయంలో కూడా కేంద్ర సహాయాన్ని కోరుతామన్నారు.


Also Read: పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్ పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖపట్నం సీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అదనపు డీజీగా బదిలీ చేసింది. అదేవిధంగా శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×