CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఆదివారం అయోధ్య రామమందిరంలో బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు సీఎం చంద్రబాబుకు ఉత్తర్ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయం నిర్మాణాన్ని వివరించారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు.
“మంచి పాలనకు రామ రాజ్యమే ప్రామాణికం. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. ఈ దేవాలయం మన దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. నేటి సమాజంలో ఆధ్యాత్మిక విలువల నిర్మాణంలో, అయోధ్య మందిరం కీలక పాత్ర పోషిస్తుంది” -సీఎం చంద్రబాబు
Also Read: Taneti Vanitha: బాలయ్య సినిమా అప్పుడు 20 పొట్టేళ్లు నరికితే కనపడలేదా?: మాజీ మంత్రి తానేటి వనిత ఫైర్