E-Paper
Advertisement

CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు

CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు
Advertisement

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారైంది. సీఎం గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి పర్యటన ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణాలు, శంకు స్ధాపన జరిగిన ప్రాంతాన్ని ఈ సందర్భంగా సీఎం సందర్శించనున్నారు. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లు సీఎం పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ నిర్మాణాల స్థితిగతులను  తెలుసుకోనున్నారు.

ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఉదయం 11 గంటలకు సీఎం పర్యటన ప్రారంభం అవుతుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి.. జగన్ భవనాలను పాడు బెట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 నుంచి 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసిందని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది.

Advertisement

Also Read: మంగళగిరిలో ప్రజా దర్బార్.. ప్రజల నుంచి అనూహ్య స్పందన

మాజీ సీఎం జగన్ గతంలో తొలి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వాడుకుని మరీ, మరుసటి రోజే కూల్చి వేసి ఇంతవరకు శిథిలాలను తొలగించని చోటు నుంచే సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. విధ్వంసానికి ప్రతీకగా ఆ ప్రాంతం గురించి అందరికీ తెలియచేయాలనే ఉద్యేశంతో సీఎం దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×