BigTV English
Advertisement

Jagan : సీఎం జగన్ పోలవరం పర్యటన.. పనుల పురోగతిపై సమీక్ష..

Jagan : సీఎం జగన్ పోలవరం పర్యటన.. పనుల పురోగతిపై సమీక్ష..


AP CM Jagan today news(Andhra news updates) : పోలవరంలో సీఎం జగన్ పర్యటించారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై చేశారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని స్పష్టం చేశారు. 12,658 కుటుంబాలను తరలించామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.

పోలవరాన్ని టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పోలవరం వద్ద బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి ఈ ‌ పనుల పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.


పోలవరం ప్రాజెక్టులో చిన్న సమస్యలను విపత్తుగా చూపించే మీడియా ఏపీలో ఉందని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనుల పురోగతిని అధికారులు వివరించారు.

పోలవరంఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. ప్రాజెక్ట్‌ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

Big Stories

×