E-Paper
Advertisement

Karumanchi Samyukta: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?

Karumanchi Samyukta: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?
Advertisement

AP Deputy CM Pawan Kalyan Praises Karumanchi Samyukta: ఏపీకి చెందిన మైసూరివారిపల్లె గ్రామ సర్పంచ్ పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రస్తుతం ఏపీలో ఆ మహిళా సర్పంచ్ పేరు మారుమోగుతుంది. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమెను ఎందుకు డిప్యూటీ సీఎం ప్రశంసించారు అనే వివరాలను తెలుసుకునేందుకు నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారంటా. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీలోని అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె సర్పంచ్ కారుమంచి సంయుక్తపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో సంయుక్త బరిలో నిలిచి విజయం సాధించారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు.

Also Read: “చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”

Advertisement

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో రోడ్లపైకి రావాలంటేనే అందరూ భయపడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా సంయుక్త పోటీలో నిలబడి విజయం సాధించారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే సంయుక్త ఆశయం. నిజంగా అది నా గుండెను కదిలించింది. సంయుక్త పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలంటూ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె గెలిచాక నాకు చాలా ఆనందం వేసింది. అందుకే ఆమెను అభినందిస్తున్నా’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×