BigTV English
Advertisement

AP Flood Relief: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!

AP Flood Relief: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!

AP Flood Victims Compensation Distribution: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడంతో వరదలకు దారితీశాయి. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం సాయం అందించింది.


అయితే, ఇప్పటికే వరదల్లో సర్వం కోల్పోయన బాధితుల్లో దాదాపు 98శాతం మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు సోమవారం వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది.

పరిహారం అందించిన 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.584కోట్లు ప్రభుత్వం జమ చేయగా.. మరో రూ.18కోట్లు అందించాల్సి ఉంది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారిలో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.


ఈ నేపథ్యంలోనే ఆ బాధితుల ఖాతాలకు సంబంధించి మళ్లీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సరి చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వరద సాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వీరి ఖాతాల్లో రూ.18.69 కోట్లను డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Also Read: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్

ఇదిలా ఉండగా, వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 15వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలు, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితులకు నిధులు పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×