E-Paper
Advertisement

AP Flood Relief: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!

AP Flood Relief: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!
Advertisement

AP Flood Victims Compensation Distribution: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడంతో వరదలకు దారితీశాయి. రాష్ట్రంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం సాయం అందించింది.

అయితే, ఇప్పటికే వరదల్లో సర్వం కోల్పోయన బాధితుల్లో దాదాపు 98శాతం మందికి ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు సోమవారం వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది.

Advertisement

పరిహారం అందించిన 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.584కోట్లు ప్రభుత్వం జమ చేయగా.. మరో రూ.18కోట్లు అందించాల్సి ఉంది. వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వారిలో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే ఆ బాధితుల ఖాతాలకు సంబంధించి మళ్లీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సరి చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వరద సాయం వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వీరి ఖాతాల్లో రూ.18.69 కోట్లను డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్

ఇదిలా ఉండగా, వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తప్పనిసరిగా సాయం అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 15వేల కుటుంబాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలు, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితులకు నిధులు పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×