BigTV English

Botsa Satyanarayana: ఏపీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana: ఏపీలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana latest news(AP political news): అధికారంలో ఉన్న వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కూల్చివేతపై ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు జరగకూడదని అన్నారు.


తమ ప్రభుత్వ హయాంలో గతంలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీ కార్యాలయాలు, నాయకులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పరిశీలించడం సరికాదని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పొరపాట్లు జరిగితే నోటీసులు ఇవ్వాలి కానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. వర్సిటీల్లో వీసీలను తొలగించాలని దౌర్జన్యాలకు దిగటం తప్పని అన్నారు.

గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పుడు తమ పార్టీ నేతలు చేసిన తప్పుల్ని సమర్థించ లేదని తెలిపారు. విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణలు సరికాదన్నారు. అందుకు సంబంధించిన డాక్యెమెంట్స్ తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా అందరు రిటైర్ అయ్యాక మాట్లాడుతున్నారని తెలిపారు. అది ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు.


రాష్ట్ర ఆర్థిక పురోగతి టీడీపీకి వాళ్ళకి తెలుసు. పథకాలు ఇస్తారో ఇవ్వరో కూడా వాళ్ళకే తెలియాలి.రిటైర్మెంట్ కలుపుకొని చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 117 జీవోను రద్దు చేస్తే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని బట్టి ఉద్యోగాలు భర్తీ చేయవచ్చని తెలిపారు.

 

Tags

Related News

Kakinada Fishermen Release: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Big Stories

×