E-Paper
Advertisement

Chandrababu : కరకట్ట గెస్ట్‌హౌస్‌ అటాచ్.. బాబుకు జగన్ ప్రభుత్వం షాక్..

Chandrababu : కరకట్ట గెస్ట్‌హౌస్‌ అటాచ్.. బాబుకు జగన్ ప్రభుత్వం షాక్..
Advertisement

Advertisement

Chandrababu : ఏపీ ప్రభుత్వం సంచలన చర్యలు చేపట్టింది. చంద్రబాబుకు భారీ షాక్‌ ఇచ్చింది. కృష్ణానది కరకట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

అధికారంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ క్విడోప్రోకోకు పాల్పడ్డారని గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. CRDA మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారనేది ప్రధాన ఆరోపణ. చట్టాలను, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని అభియోగాలు నమోదు చేసింది.

Advertisement

వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. క్రిమినల్‌ లా అమెండ్ మెంట్‌ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్ హౌస్ ను అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. ఈ విషయంపై స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చింది.

లింగమనేని రమేష్ కు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారని విమర్శించారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని ఆరోపించారు.

రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు గతంలో విమర్శించారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారని ఆరోపించారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్, జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారని సీఐడీ గుర్తించింది. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారని నిర్ధారించింది.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×