E-Paper
Advertisement

Annamaya District: అత్యంత దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Annamaya District: అత్యంత దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన
Advertisement

Annamaya District: అన్నమయ్య జిల్లాలో అత్యంత దారుణమైన అఘాయిత్యం జరిగింది. బి. కొత్తకోట మండలం, డేగానిపల్లె గ్రామంలో 65 ఏళ్ల వృద్ధురాలైన కోనమ్మపై ఈశ్వర్ అనే యువకుడు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కళ్లు కనపడని తన భర్తకు సేవలు చేస్తూ.. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ వృద్ధురాలు నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘోరానికి గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డేగానిపల్లెకు చెందిన కోనమ్మ (65) తన కళ్లు కనపడని భర్తతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె నిత్యం ఇళ్లల్లో పనిచేసుకుంటూ.. సంపాదించిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో.. గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో.. ఆ వృద్ధురాలి ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకుని.. ఈశ్వర్ మద్యం మత్తులో ఆమె ఇంట్లోకి దూరాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిపై దాడి చేసి, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం గురించి ఉదయం స్థానికులు గమనించడంతో వార్త వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే స్పందించారు. రక్తస్రావంతో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు కోనమ్మను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. వృద్ధాప్యం, గాయాల కారణంగా ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో స్థానికులు వెంటనే బి. కొత్తకోట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డేగానిపల్లె చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో.. అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఈశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఈశ్వర్ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

బి. కొత్తకోట పోలీసులు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేశారు. వృద్ధురాలు కోనమ్మ స్టేట్‌మెంట్ ఆధారంగా.. ఇతర సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడు ఈశ్వర్‌పై ఐపీసీ (IPC) సెక్షన్ల కింద కేసు నమోదు చశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కళ్లు కనపడని భర్తకు అండగా నిలుస్తూ, కష్టపడి పనిచేసుకునే వృద్ధురాలిపై జరిగిన ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వృద్ధుల భద్రత, మహిళా రక్షణపై ప్రభుత్వం, పోలీసులు మరింత దృష్టి సారించాలని స్థానికులు, సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.

Advertisement

ALSO READ: Money saving tips: ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు ఆదా చేయాలా? ఈ యాప్స్ మీ కోసమే, ట్రై చేయండి!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×