E-Paper
Advertisement

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?

Kadambari jethwani case : ముంబయి నటి కాదంబరి కేసులో కీలక పరిణామం… నేడో రేపో సీఐడీ చేతికి ?
Advertisement

ముంబయి నటీమణి కాదంబరి జెత్వాని కేసు కీలక మలుపు తీసుకోనుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నాయి.

ఈ కేసులో నలుగురు పోలీసులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు, మరో న్యాయవాది మొత్తం ఐదుగురు వ్యక్తులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం, వాదనలు పూర్తి చేసినట్లు సమాచారం.

Advertisement

ఈ మేరకు తీర్పును రిజర్వు చేస్తూ అక్టోబర్ 4న వెలువరిస్తామని కోర్టు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు గత 15 రోజులుగా ఈ కేసుకు సంబంధించి ఏపీ ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి ఈరోజు వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Also read : దసరాకు సూపర్ కానుక ప్రకటించిన ప్రభుత్వం.. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు

Advertisement

సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఈ కేసును ఏపీసీఐడీకి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధింపులకు గురి చేశారని ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి దిగువస్థాయిలో ఇన్‌స్పెక్టర్లు, ఆ కింద స్థాయి అధికారులు అప్రూవర్‌లుగా మారడంతో ముగ్గురు ఐపీఎస్‌లకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.

కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఐపీఎస్‌లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు చాలా ప్రోసీజర్లను అనుసరించాలని యూపీఎస్సీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతే ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.  ఈ వ్యవహారంపై కాదంబరి జెత్వాని ఫిర్యాదుతో కదిలిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కారణంగానే సీఐడీ విచారణకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×