E-Paper
Advertisement

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్!
Advertisement

AgriGold Lands: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు మూడు సమావేశాలు జరిగాయని అన్నారు. ఇవాళ కొన్ని నిర్ణయలు తీసుకున్నామని, అగ్రిగోల్డ్ డిపాజిటర్లు నిజమైన బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 20 వేల ఎకరాల భూమి ఏపీలో ఉందని అన్నారు. 6 వేల ఎకరాల పైగా భూమి ఆక్షన్ కు సిద్ధంగా ఉందని, త్వరగా ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సీఐడీని కోరామని మంత్రి తెలిపారు.

5 లక్షల మంది ఏజెంట్లు..

గత మీటింగ్‌లో మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి పోలీసు శాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అగ్రిగోల్డ్ కు 5 లక్షల మంది ఏజెంట్లు పని చేస్తున్నారని, 6 వేల కోట్లు డిపాజిట్లుగా తీస్కున్నారని అన్నారు. 3 వేల కోట్లు ఏపీ నుంచే తీస్కున్నారని, 18 లక్షల 57 వేల 290 మందికి ప్లాట్లు ఉన్నాయని చెప్పి డిపాజిట్ తీస్కున్నారని గుర్తు చేశారు. దీనిసై చాలా లోతుగా కసరత్తు జరగాలని మంత్రి తెలిపారు. సరైన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ప్రజలకు తెలిసేలా ఒక వెబ్ సైట్ ఓపెన్ చేస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

సెప్టెంబర్ 15 లోపు..

సమావేశంలో 9 రాష్ట్రాల నుంచి ఏజెంట్లు వచ్చారని, ఏ రాష్ట్రంలో వారు అక్కడ బాండ్లు ఇస్తామని చెప్పారని అన్నారు. పోలీస్ శాఖతో సంప్రదించి, ఎక్కడికక్కడ బాండ్లు తీసుకోడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం ని కోరామరని తెలిపారు. ఈ నెల 11న సీఎస్ తో కలిపి సమావేశం ఏర్పాటు చేస్తున్నాని, ఆగస్ట్ 15 లోపు స్పెషల్ కోర్ట్ ఏర్పాటు జరగాలని కోరుతున్నామన్నారు. ఆక్షన్ విషయంలో విధి విధానాల 11 లోపు పూర్తి చేస్తామని, విడతల వారీగా ఇకపై అన్ని నిర్ణయాలు ఉంటాయన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేస్తాంమని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు.

Advertisement

Also Read: తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

Tags

Related News

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!

విశాఖ ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీ పై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్!

‘టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ’.. దేవరపల్లి వేదికగా జగన్ షాకింగ్ కామెంట్స్!

రాజధానిలో ప్రారంభోత్సవాలు.. ఆగస్టు 13న అలా అమరావతిలో!

‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

ప్రకాష్ రాజ్ పళ్లు రాలగొడతాం.. సైబర్ డీజీకి బీజేపీ నేతలు ఫిర్యాదు

Big Stories

Advertisement
×