SSMB29 : మామూలుగా చాలామంది అభిమానులు ట్విట్టర్ వేదికగా గొడవలు పడుతూ ఉంటారు. కానీ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా వార్ చేస్తే ఎలా ఉంటుంది.? ఖచ్చితంగా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఏకంగా మహేష్ బాబు రాజమౌళి ట్విట్టర్ వేదికగా కాన్వర్జేషన్ మొదలుపెట్టారు.
మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి మహేష్ బాబు బర్తడే కూడా అసలైన అప్డేట్ ఇవ్వలేదు. అయితే చాలామంది నవంబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఉంటుంది అని ఊహిస్తున్నారు. టీం కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసినట్లే.
మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి ని ఎప్పుడు అప్డేట్ అడిగినా కూడా సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. రీసెంట్గా ప్రభాస్ అడిగినా కూడా నోరు విప్పలేదు. ఏకంగా మహేష్ బాబు ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది ఏంటి పరిస్థితి అని రాజమౌళిని ట్యాగ్ చేశారు.
రాజమౌళి దానికి సమాధానంగా ఎస్ ఇది నవంబర్ ఏ సినిమాకి రివ్యూ ఇద్దామనుకుంటున్నావని మహేష్ బాబు ని తిరిగి ప్రశ్నించారు.
అదంతా కాదు మొదటి జరగాల్సింది మొదటి జరగాలి మీరు నవంబర్లో అప్డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు అని ప్రశ్నించడం మహేష్. దానికి సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ అదే పనిలో ఉన్నామంటూ చెప్పారు. ఒక్కొక్కటి స్లోగా రిలీజ్ చేస్తా అని రాజమౌళి చెప్పారు.
It’s November already @ssrajamouli 👀
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
ఎంత స్లో సర్? 2030 లో స్టార్ట్ చేద్దామా? మరోవైపు మన దేశి గర్ల్, హైదరాబాదులోని అన్ని స్ట్రీట్స్ కూడా ఇన్స్టా స్టోరీలో జనవరి నుంచి రివీల్ చేస్తుంది అంటూ చెప్పారు మహేష్. అతనికి వీరిద్దరి మధ్య సంభాషణ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
వీళ్ళ సంభాషణ అంతా విన్న తర్వాత కచ్చితంగా నవంబర్ నెలలో మహేష్ బాబు సినిమాకి సంబంధించి అప్డేట్ రానుంది అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. ప్రేక్షకులు విపరీతంగా బ్రహ్మ రథం పడుతున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా కనిపించడం ఆశ్చర్యం.
Also Read: Biker: బైకర్ టీజర్ రిలీజ్, అదరగొట్టిన శర్వా సక్సెస్ ఖాయమేనా?