BigTV English

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal Crisis: ఫలించిన లోకేష్ కృషి.. నేపాల్ నుంచి స్వదేశానికి ఆంధ్రా వాసులు

Nepal Crisis: నేపాల్ లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న.. తెలుగువారిని కాపాడేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజిఎస్ భవనంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, పలువురు ముఖ్యాధికారులు పాల్గొన్నారు.


తక్షణ చర్యలపై దృష్టి

సమావేశంలో నేపాల్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను.. వెంటనే విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ, ఏపీ భవన్ అధికారులతో సమన్వయం జరుపుతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈరోజు సాయంత్రం లోగా ఎవరూ నేపాల్‌లో ఇబ్బందులు పడకుండా.. వారందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.


ఎయిర్‌లిఫ్ట్ ప్రణాళికలు

విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన విమానాశ్రయాలకు.. ప్రత్యేక విమానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ వాసులు చేరుకునేలా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విమానాశ్రయాలకు చేరుకున్న వెంటనే వారికి స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంఎల్ఏలు స్వాగతం పలకాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రభుత్వ తరఫున వారికి అవసరమైన.. అన్ని సౌకర్యాలు కల్పించబడతాయని ఆయన తెలిపారు.

సురక్షిత రవాణా ఏర్పాట్లు

విమానాశ్రయాలకు చేరుకున్న తరువాత.. వారు తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకునేలా తగిన బస్సులు, ఇతర రవాణా వసతులు సమకూర్చాలని.. సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చిన తరువాత కూడా వారిని పూర్తి సురక్షితంగా.. ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది అని నారా లోకేశ్ అన్నారు.

అధికారులతో సమన్వయం

ఈ సమీక్షలో ముఖ్య కార్యదర్శులు ముకేశ్ కుమార్ మీనా, కుమార్ విశ్వజిత్, కార్యదర్శి కోన శశిధర్, ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ నుండి ఆర్జా శ్రీకాంత్ తదితర అధికారులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. విదేశాంగ శాఖతో కలసి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి, ఏపీ వాసుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మానవతా ధోరణి – ప్రజలకు ధైర్యం

నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎక్కడ చిక్కుకున్నా వారిని రక్షించడం ప్రభుత్వ ధర్మం. కష్టకాలంలో ప్రభుత్వమే అండగా నిలుస్తుంది అని తెలిపారు.

సమన్వయం – సహకారం

ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, విమానయాన సంస్థలు, రాష్ట్ర రవాణా శాఖతో పాటు పలు విభాగాలు.. సమన్వయం కలిగి పని చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

Also Read: మా వాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను రక్షించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చర్యలు.. ప్రజల ప్రాణాలను కాపాడడమే కాకుండా, ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరిచాయి. సాయంత్రం లోగా వారందరూ రాష్ట్రానికి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది.

Related News

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు, జగన్‌కు సన్నిహితుడా?

Nepal: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

TTD Pink Diamond: శ్రీవారి పింక్ డైమండ్.. ఆర్కియాలజికల్‌ విభాగం క్లారిటీ, వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?

YS Jagan: మావాళ్లు ఇంకా గేర్ మార్చలేదు.. బాధపడుతున్న జగన్

AP Politics: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది

Big Stories

×