E-Paper
Advertisement

AP Housing Scheme: ఏపీలో డెడ్ లైన్.. ఆరోజుకు పూర్తి చేయాలి.. లేకుంటే?

AP Housing Scheme: ఏపీలో డెడ్ లైన్.. ఆరోజుకు పూర్తి చేయాలి.. లేకుంటే?
Advertisement

AP Housing Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహనిర్మాణంలో స్పీడ్ పెంచింది. లక్షలాది గృహాలు నిర్మాణ దశలో ఉన్న నేపథ్యంలో, వాటిని 2026 మార్చి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి రోజు 200 ఇళ్ల నిర్మాణం లక్ష్యం
గతంలో కంటే వేగంగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలన్న ఆదేశాలతో, మంత్రి పార్ధసారధి రోజుకు కనీసం 200 ఇళ్లను పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల గృహనిర్మాణ అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

ఇంజినీరింగ్ సిబ్బందిపై స్పష్టమైన ఆదేశాలు
గృహనిర్మాణ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రతీ రోజూ లేఔట్స్‌ను సందర్శించి, అక్కడ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన చోట ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సహకరించకపోతే, తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి అని మంత్రి సూచించారు.

నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉండాలి
ఇళ్ల నిర్మాణం నిలిచిపోకుండా ఉండేందుకు అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుకలు, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్లు తమస్థాయిలో వీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.

Advertisement

Also Read: Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో.. రోజువారీ వింతలు.. తెలుసుకుంటే ఔరా అనేస్తారు!

సమన్వయంతో ముందుకు సాగాలి
పూర్తికాకున్న గృహాల నిర్మాణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు.. గృహనిర్మాణ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమే కీలక సమస్యగా మంత్రి గుర్తించారు. అందుకే ప్రతీ చోట సహకారంతో, ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలి అన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్ష జరపాలని చెప్పారు.

2026 మార్చికి గడువు.. అనంతరం కఠిన చర్యలు?
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న లక్షలాది ఇళ్లను 2026 మార్చిలోపు పూర్తి చేయాలి అనే లక్ష్యంతోనే ప్రభుత్వం నడుస్తోంది. గడువు మించితే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సంకేతాలివ్వబడ్డాయి. అటు అజేయ్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ ప్రగతిని నిత్యం అప్‌డేట్ చేస్తూ, అవసరమైన స్థాయిలో ఫండ్స్ మరియు మానవవనరులు అందిస్తున్నాం అన్నారు.

ప్రజల కలల ఇళ్ల కోసం ప్రభుత్వ పోరాటం
ఈ పథకంలో లక్షల మంది పేదలకు తమ సొంత గృహం కలలు నిజమవుతాయనే ఆశ ఉంది. ప్రభుత్వానికి కూడా ఇదే ప్రాధాన్యత. అందుకే తీవ్రమైన సమీక్షలు, చర్యలు, నిరంతర పర్యవేక్షణ జరుగుతున్నాయి. ఈ వేగం కొనసాగితే, రాష్ట్రంలో హక్కుగా ఇల్లు పొందిన ప్రతి కుటుంబానికి 2026 నాటికి సొంత గృహం సిద్ధమవుతుందనడంలో సందేహం లేదు.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×