BigTV English

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

Flood Victims: వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే?

Financial Assistance to flood Victims: ఏపీలో ఇటీవలే భారీగా వర్షాలు, వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయితే, తాజాగా మరో విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఎస్డీఆర్ఎఫ్) నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను మార్చుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.


Also Read: టీటీడీ ఆస్తులు, ఆభరణాల సంగతేంటీ? జగన్ టీమ్‌పై సందేహాలు.. చంద్రబాబుకు పవన్ లేఖ!

మొత్తం 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన రూ. 11 వేలకు బదులుగా రూ. 25 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. మొదటి అంతస్తులో ఉన్న ముంపు బాధితులకు రూ. 10 వేలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ. 25 వేలు, వ్యవసాయ పంటలకు హెక్టారుకు రూ. 25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నది. అదేవిధంగా వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: మీరు జూనియర్ న్యాయవాదులా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే..

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×