E-Paper
Advertisement

AP Students: పది విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

AP Students: పది విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Advertisement

AP Students: ఏపీలోని పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పది పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇప్పటికే పది పరిక్షల షెడ్యూల్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా పది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఏపీ ప్రభుత్వం పది పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 17 నుండి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అది కూడా ప్రతి పరీక్షకు ఒకటి లేక రెండు రోజుల గడువు ఉండడం విశేషం. దీనివల్ల విద్యార్థుల్లో ఉన్న పరీక్షల భయం కొంతైనా తగ్గుతుందన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పది పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించేందుకు ఈ సమయం ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయ పడ్డారు.

Advertisement

తాజాగా పది పరీక్షల ఫీజు విషయంలో కూడా మంచి నిర్ణయంను ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల ఫీజును చెల్లించలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, ఫీజు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ నెల 27 నుండి జనవరి 10వ తేదీ వరకు రూ. 1000 ఫైన్ తో ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

Also Read: AP Govt: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక అదిరింది కదూ!

Advertisement

పలు కారణాలతో పరీక్ష ఫీజు చెల్లించలేని విద్యార్థులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే పది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం సూచించింది. విద్యలో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి, ఉత్తమ మార్కుల సాధనకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరింది. మరి పది విద్యార్థులూ.. ఫీజు గడువు పెంచారు. వెంటనే మీ హెచ్.యం లను సంప్రదించి ఫీజు ఆన్ లైన్ చెల్లించారో లేదో చూసుకోండి!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×