BigTV English

AP Govt: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు షాక్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

AP Govt: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు షాక్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

AP Govt: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.


సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ కుమార్ పై త్రిబుల్ ఆర్ ఫిర్యాదు చేశారు.

అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సీఐడీ చీఫ్ గా పలు కేసులలో కీలక పాత్ర పోషించారు. కాగా రఘురామ కృష్ణరాజు అరెస్ట్ సమయంలో సునీల్ కుమార్ పేరు మార్మోగింది. తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో సునీల్ కుమార్ ఉన్నారన్నది రఘురామ కృష్ణరాజు ప్రధాన ఆరోపణ.

Also Read: AP Nominated posts: ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర.. ఆశావాహుల్లో మొదలైన అలజడి

ఆ సమయం నుండే కేంద్రానికి కూడ త్రిబుల్ ఆర్ ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం సునీల్ కుమార్ పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం అథారిటీని నియమించింది. మరి ఈ నివేదికలో వచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలుతుందని చెప్పవచ్చు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×