E-Paper
Advertisement

AP Village Secretary : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

AP Village Secretary : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Advertisement

AP Village Secretary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) మొన్నటి ఎన్నికల సమయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ (Sachivalayam) ఉద్యోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందా.. లేదా కొత్త ప్రభుత్వంలో తీసేస్తారా అనే సందిగ్ధత నెలకొని ఉంది. అలాంటి వ్యవస్థపై ఏపీలోని కూటమి ప్రభుత్వం (Ap Govt)  కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది పోస్టింగులు(Postings), గ్రామాలకు కేటాయింపులపై ప్రత్యేకంగా కసరత్తు చేసి కీలక అప్ డేట్(Update) ఇచ్చింది.

ఇప్పుడు.. ఏపీలో గ్రామాల్లో (ap villages) ఏ పనులు జరగాలన్నా సచివాలయ సిబ్బంది చేయాల్సిందే. గ్రామాల్లో చిన్నచిన్న పనుల నుంచి లబ్దిదారులను(Benificiaries) గుర్తించడం, వారికి ప్రభుత్వ  పథకాలు (Schemes) అందించడం సహా అనేక కార్యక్రమాల్లో వాళ్ల పాత్ర చాలా పెరిగిపోయింది. ఈ విధానాన్ని వైసీపీ (YCP Govt) అధికారంలో ఉండగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Ys Jaganmohan Reddy) ప్రారంభించారు. 50 ఇళ్లకు ఓ పర్యవేక్షడు ఉండేలా.. భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు.

Advertisement

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా.. 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, 3,842 వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారానే.. వాటి పరిధిలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ మొత్తం సచివాలయాల్లో 1,27,175 మంది సిబ్బంది(employees) పనిచేస్తున్నారు. గతంలో.. ఒక్కో సచివాలయం పరిధిలో పది మంది పని చేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండగా,  మరికొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సిబ్బంది సంఖ్యను ఇష్టారాజ్యంగా కేటాయించకుండా.. అవసరాల మేరకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకోసం.. అవసరం అయితే సచివాలయాల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అవసరాల మేరకు సిబ్బంది కేటాయింపు చేయనున్నారు. అందులో భాగంగా… ఇకపై 3,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయంలో 8 మంది సచివాలయ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు.

Advertisement

అలాగే.. 2,500 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న సచివాలయంలో 7 గురిని కేటాయించనున్నారు. ఆ జనాభా నిష్పత్తికి ఏడుగురితో సమర్థవంతంగా విధులు జరిపించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీలో.. 2,500 కంటే తక్కువ మంది జనాభా పరిధిలోని సచివాలయంలో ఆరుగురు చొప్పున సిబ్బందిని ఉంచనున్నారు.

Also Read : ఏపీలో భూముల రీ సర్వే మొదలు.. ఏ భూములు కొలుస్తారు.? ఏం ప్రయోజనం అంటే.?

వీరు మాత్రమే కాకుండా.. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్ గా విధుల్లో ఉంటారని.. మంత్రి పార్థసారథి వెల్లడించారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి మండలి.. గ్రామ, వార్డు సచివాలయాలపై కూడా చర్చించింది. ఈ సమావేశంలోనే సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చించనట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×