BigTV English

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..
AP High Court
AP High Court

AP High Court: ఏపీలో పింఛన్ల పంపిణీపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం వారిని ఆ బాధ్యతలను తప్పించింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియను సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు.


గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్ లబ్ధిదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు.

Also Read: పింఛన్ల పంపిణీలో గందరగోళం.. లబ్ధిదారులకు కష్టాలు..


ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించింది. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టుకు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారని అందుకే ఈ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Related News

Fake liquor In AP: సీఎం చంద్రబాబు మాటలు.. వైసీపీ నేతలకు టెన్షన్, ఇక దుకాణం బంద్?

Nandamuri Balakrishna: బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.. హిందూపురంలో అభిమానుల హంగామా

CM Chandrababu: హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మాణమే మా లక్ష్యం.. కేవలం ప్రారంభం మాత్రమే-సీఎం

Amaravati News: CRDA నూతన భవనం.. సీఎం చంద్రబాబు ప్రారంభం, కార్యకలాపాలు అమరావతి నుంచే

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Big Stories

×