E-Paper
Advertisement

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..
Advertisement
AP High Court
AP High Court

AP High Court: ఏపీలో పింఛన్ల పంపిణీపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం వారిని ఆ బాధ్యతలను తప్పించింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియను సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు.

గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్ లబ్ధిదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు.

Advertisement

Also Read: పింఛన్ల పంపిణీలో గందరగోళం.. లబ్ధిదారులకు కష్టాలు..

ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించింది. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టుకు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారని అందుకే ఈ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×