E-Paper
Advertisement

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..

AP High Court: పింఛన్ల పంపిణీ.. ఆ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు..
AP High Court
AP High Court

AP High Court: ఏపీలో పింఛన్ల పంపిణీపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం వారిని ఆ బాధ్యతలను తప్పించింది. పింఛన్ల పంపిణీ ప్రక్రియను సచివాలయాల ఉద్యోగులకు అప్పగించింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు.

గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్ లబ్ధిదారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇచ్చేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వివరించారు.

Also Read: పింఛన్ల పంపిణీలో గందరగోళం.. లబ్ధిదారులకు కష్టాలు..

ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా? అని ప్రశ్నించింది. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టుకు తెలిపారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారని అందుకే ఈ పిటిషన్ కొట్టివేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×