E-Paper
Advertisement

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..
ap political news

AP High Court Notices To Jagan(AP political news):

ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌ సహా కొంతమంది మంత్రులు, అధికారులకు నోటీసులు ఇచ్చింది. మొత్తం 41 మందికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.

ఏపీలో అమలు చేస్తున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలేవి లేవని స్పష్టంచేశారు. కేవలం వ్యక్తిగత దురద్దేశాలతో పిటిషన్‌ వేశారని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు.

మరోవైపు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది తమ వాదన వినిపించారు. ఈ పిటిషన్ హైకోర్టులో వేయగానే.. ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×