BigTV English

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court Notices To Jagan : రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ.. జగన్‌కు హైకోర్టు నోటీసులు..
ap political news

AP High Court Notices To Jagan(AP political news):

ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం వైఎస్ జగన్‌ సహా కొంతమంది మంత్రులు, అధికారులకు నోటీసులు ఇచ్చింది. మొత్తం 41 మందికి నోటీసులు పంపింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.


ఏపీలో అమలు చేస్తున్న పథకాల మాటున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రయోజనాలేవి లేవని స్పష్టంచేశారు. కేవలం వ్యక్తిగత దురద్దేశాలతో పిటిషన్‌ వేశారని ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు.

మరోవైపు పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది తమ వాదన వినిపించారు. ఈ పిటిషన్ హైకోర్టులో వేయగానే.. ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.


Related News

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Big Stories

×