E-Paper
Advertisement

AP High Court: భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్‌, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

AP High Court:  భార్యాభర్తల వివాదం.. పిల్లల డీఎన్ఏ టెస్ట్‌, ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Advertisement

భార్యాభర్తల వ్యక్తిగత విభేదాల్లోకి పిల్లలను లాగడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన ఇద్దరు పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నేరుగా తిరస్కరించింది. తల్లిదండ్రుల మధ్య సాగే న్యాయపోరాటంలో పిల్లల గౌరవం హక్కులను కాపాడటం అత్యంత ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది.

విడాకుల కేసు విచారణలో భాగంగా భర్త ఈ విన్నపాన్ని కోర్టు ముందు ఉంచారు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నిరూపించడానికి పిల్లల డీఎన్ఏ పరీక్షలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆ పిల్లలకు తాను తండ్రిని కాదనే నిజాన్ని ఈ పరీక్షలు వెల్లడిస్తాయని వాదించారు. తద్వారా భార్య వ్యభిచారానికి పాల్పడిందనే తన ఆరోపణలకు బలమైన సాక్ష్యం లభిస్తుందని వివరించారు.

Advertisement

ఈ కేసును విచారించిన జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహేతర సంబంధాల ఆరోపణలను నిరూపించుకోవడానికి పిల్లలను ఒక సాధనంగా వాడుకోవడం చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ట్రయల్ కోర్టు సైతం ఇదే విన్నపాన్ని తోసిపుచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. భార్యపై ఉన్న ఆరోపణలను ఇతర సాక్ష్యాల ద్వారా నిరూపించుకోవాలే తప్ప పిల్లల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది.

భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 112 అంశాన్ని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. చెల్లుబాటు అయ్యే వివాహ బంధంలో పుట్టిన బిడ్డను చట్టబద్ధమైన సంతానంగానే పరిగణించాలని ఈ సెక్షన్ చెబుతోంది. దీనిని కాదని నిరూపించాలంటే అత్యంత బలమైన సాక్ష్యాలు ఉండాలి. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడం వల్ల పిల్లల మానసిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో వారి ప్రతిష్టకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించింది.

Advertisement

డీఎన్ఏ పరీక్షల విషయంలో 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం హైకోర్టు ఉదహరించింది. పిల్లల గోప్యతను వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. కేవలం అనుమానాల ఆధారంగా పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టలేమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ALSO READ: Social media: సోషల్ మీడియాపై మోదీ సర్కార్ ఉక్కుపాదం.. ఇక నిమిషాల్లో ఫేక్ వీడియోలు డిలీట్, అదెలా అంటే..?

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×