E-Paper
Advertisement

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..

AP Highcourt : జగన్ సర్కార్ కు షాక్.. R-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే..
Advertisement

AP Highcourt : అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. రాజధానేతర ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేసింది. ఈ మేరకు జీవోలు ఇచ్చింది. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసింది. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ అమరావతి ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్పు నిచ్చింది.

Advertisement

హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×