E-Paper
Advertisement

Maoist commander Hidma: ఏపీలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం.. పౌర హక్కుల నేతల సంచలన ఆరోపణలు!

Maoist commander Hidma: ఏపీలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం.. పౌర హక్కుల నేతల సంచలన ఆరోపణలు!
Advertisement

Maoist commander Hidma: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై తీవ్ర వివాదం రాజుకుంది. గత నెల 28న మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా, అతని సహచరులను పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ అని పౌర హక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో, విజయవాడలో భారీ సంఖ్యలో మావోయిస్టు కేడర్‌ను, అగ్ర నేతల రక్షణ గార్డులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఏపీలోని ఒక షెల్టర్‌లో ఉన్న హిడ్మా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లి, నిరాయుధులుగా ఉన్న వారిని అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండిస్తూ, మరికొందరిని కూడా ఇలాగే హత్య చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టుబడిన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని, ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

మరోవైపు, విజయవాడ న్యూ ఆటోనగర్‌లో 27 మంది మావోయిస్టు పార్టీ కేడర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) వర్గాలు తెలిపాయి. వీరిలో 9 మంది మావోయిస్టు అగ్రనేత దేవ్ జీకి రక్షణ గార్డులుగా ఉన్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ధృవీకరించినట్లు సమాచారం. మిగిలిన వారంతా పార్టీ కేడర్‌కు చెందినవారేనని, వీరంతా గెరిల్లా ఆర్మీకి చెందినవారు కావడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి.

దండకారణ్యంలో కేంద్ర బలగాల ఒత్తిడి పెరగడంతో, మావోయిస్టు నేతలు తమ కార్యకలాపాలను ఏపీలో విస్తరింపజేసేందుకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. పార్టీపై నిర్బంధం పెరిగిన నేపథ్యంలో, తమ ఉనికిని నిరూపించుకునేందుకు అగ్ర నేతలను టార్గెట్ చేసేందుకు వీరు రెక్కీ నిర్వహించి ఉండవచ్చని SIB అనుమానిస్తోంది. ఈ అరెస్టులతో ఏపీలో అగ్ర నేతలను మట్టుబెట్టేందుకు వచ్చిన వారి కుట్రను భగ్నం చేశామని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×