E-Paper
Advertisement

Atchannaidu Fires on Botsa: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు

Atchannaidu Fires on Botsa: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు
Advertisement

Minister Atchannaidu Fires on botsa Satyanarayana’s Tweet: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై టీడీపీ నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందంటూ బొత్స ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

Also Read: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

Advertisement

‘భలే జోకులేస్తున్నారు బొత్స గారు..! పారదర్శకత గురించి మీరు.. జగన్ మాట్లాడితే నవ్విపోతారు.. వద్దులెండీ? పారదర్శకతకు పాతరేసింది మీరు.. మీ పార్టీ. ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరంతా పని చేస్తున్నారు. బొత్స గారు దయచేసి పారదర్శకత.. వాస్తవాలు లాంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దు.. Now AP in Safe Hands.. Don’t Worry.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సమావేశమయ్యాక అన్ని విషయాలు తెలుస్తాయి’ అంటూ అచ్చెన్నాయుడు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: ప్రాణం నిలబెట్టే ఆసుపత్రులే నిజమైన దేవాలయాలు: మంత్రి సత్యకుమార్

Advertisement

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. దాదాపు రెండు గంటలపాటు వారు చర్చించి.. సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో మరో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ భేటీలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు హాజరయ్యారు.

Tags

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×