E-Paper
Advertisement

AP: శాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ఏం చెప్పారంటే..?

AP: శాఖల కేటాయింపు తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన లోకేశ్.. ఏం చెప్పారంటే..?
Advertisement

Minister Nara Lokesh: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంత్రులకు శాఖల కేటాయింపు అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతామంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొస్తామన్నారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామంటూ లోకేశ్ హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

ఇటు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్ర వరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదని, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వలేదంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో పైరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగినటువంటి భూ అక్రమాలపై విచారణ చేయిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఇతనేనంటా..!

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సాయాన్ని రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు చంద్రబాబు పెంచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమమేకాదు ఇటు అభివృద్ధిపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తదని ఆయన పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లను కూడా తెరిపిస్తామంటూ ఆయన తెలిపారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×