BigTV English

AP Political: రోజాకు సిగ్గుండాలి.. తల్లి, చెల్లి బంధాల విలువ తెలియని జగన్.. మంత్రి సంధ్యారాణి ఫైర్

AP Political: రోజాకు సిగ్గుండాలి.. తల్లి, చెల్లి బంధాల విలువ తెలియని జగన్.. మంత్రి సంధ్యారాణి ఫైర్

– 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందా?
– ఏదీ, ఏడుగురి పేర్లు చెప్పు చూద్దాం
– నోటికొచ్చింది మాట్లాడడానికి సిగ్గుండాలి
– ఐదేళ్లు ఒక్క ఆడపిల్లకైనా రక్షణ ఇచ్చారా?
– జగన్, రోజాపై మంత్రి సంధ్యారాణి ఫైర్


పార్వతీపురం, స్వేచ్ఛ: AP Political: మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్‌పై ఫైరయ్యారు. ఆస్తి కోసం సొంత తల్లిని, చెల్లిని కోర్టులో పెట్టిన జగన్ మనిషేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ పోటీ చేసిన టైమ్‌లో సొంత ఇల్లు కూడా లేదు, అలాంటిది అన్ని ఆస్తులు జగన్ ఏ విధంగా సంపాదించారని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇళ్లు కూడా లేని రాజశేఖర్‌రెడ్డి కుమారుడికి ఇప్పుడు ఇన్ని ఇళ్లు ఎలా వచ్చాయని అడిగారు.

జగన్ ఇంత ఆస్తి ఎలా వచ్చింది, రాళ్లు కొట్టి సంపాదించారా అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఉన్న వారందరూ అక్క చెల్లెమ్మలే అని చెప్పుకునే జగన్, సొంత తల్లిని బయటకు తోసేసి, చెల్లికి కోర్టుకు లాగారంటూ విమర్శించారు. ఇంత చేసి, చంద్రబాబు, లోకేష్ గురించి ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. కరోనా సమయంలో జనాన్ని పలకరించని జగన్, మొన్న గుర్లలో కేవలం రాజకీయ లబ్ధి కోసం పలకరింపులు చేశారని అన్నారు మంత్రి సంధ్యారాణి. ఇక, రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ, 74 మంది మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పిన రోజా, కనీసం ఏడుగురు పేర్లు అయినా చెప్పాలని డిమాండ్ చేశారు.


Also Read: CM Chandrababu: మద్యం ప్రియులకు సూపర్ ఛాన్స్.. అలా చేస్తే ప్రశ్నించండి.. లేదా ఫిర్యాదు చేయండి: సీఎం చంద్రబాబు

రోజా అలా మాట్లాడేందుకు సిగ్గుండాలని మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఆడపిల్లకు కూడా మీరు రక్షణ కల్పించలేకపోయారని ఆరోపించారు. ఏదైనా సంఘటన జరిగితే చంద్రబాబు ఆదేశాల మేరకు శాఖల పరమైన మంత్రులే నేరుగా వెళ్తున్నారని వివరించారు. ప్రజలు మిమ్మల్ని ఛీ కోట్టారన్న విషయం మర్చిపోవద్దని, ఇంకా ఛీ కొట్టించుకోవాలని తాపత్రయపడొద్దని చురకలంటించారు. వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన జగన్, ఇంతవరకు ఆ చెక్కు పంపిణీ చేయలేదన్నారు మంత్రి.

Related News

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

Big Stories

×