E-Paper
Advertisement

AP Onion Farmers: ఉల్లి రైతులకు బాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 50 వేలు

AP Onion Farmers: ఉల్లి రైతులకు బాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 50 వేలు
Advertisement

AP Onion Farmers: కర్నూలు ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు.. హెక్టారుకు రూ.50,000 చొప్పున సహాయం అందించాలని సర్కారు నిర్ణయించింది. దాదాపు 30 వేల మంది ఉల్లి రైతులకు లభ్ధి చేకూరునట్లుగా తెలుస్తోంది.

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి రాశులు

Advertisement

ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో.. ఎటు చూసినా ఉల్లి బస్తాలే కనిపిస్తున్నాయి. రహదారులపైనే వాహనాలు వరుస కట్టడంతో.. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మార్కెట్ షెడ్లలో ఉల్లి రాశులు గుట్టలుగా పేరుకుపోయాయి.

గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన

Advertisement

ఉల్లి రైతుల కష్టాలు చెప్పలేనివి. ఈసారి మార్కెట్లో ఒక క్వింటాల్ ఉల్లి ధర 30 రూపాయల వరకు పడిపోయింది. కొంతమంది రైతులు కేజీకి 30 పైసలకే ఉల్లి అమ్ముకోవాల్సి వచ్చింది. పెట్టుబడిగా ఖర్చు చేసిన డబ్బు తిరిగి రావడం దూరం, రవాణా ఖర్చులు కూడా మిగలకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొంతమంది రైతులు తమ ఉల్లిని డంప్‌యార్డ్‌లకు తరలించి పడవేయాల్సి వచ్చింది.

మహారాష్ట్ర ఉల్లి ప్రభావం

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా.. మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా కావడం వల్ల కర్నూలు రైతులకు గట్టి దెబ్బ తగిలింది. రాష్ట్ర మార్కెట్లలో మహారాష్ట్ర ఉల్లి ఆధిపత్యాన్ని అరికట్టడంలో.. అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.

చౌక ధరకు ఉల్లి విక్రయాలు

మార్కెట్ యార్డ్‌లో నిల్వలు తగ్గించేందుకు.. అధికారులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి కర్నూలు మార్కెట్ యార్డ్‌లోని గోదాం నం.7లో ఉల్లి బస్తాలను (సుమారు 45 కిలోలు) ఒక బస్తా రూ.100కే విక్రయించనున్నారు. ఈ ప్రక్రియ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ప్రకటించారు. వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీ దుకాణాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఏపీ మార్క్‌ఫెడ్ ప్రయత్నాలు

ఉల్లి నిల్వలు తగ్గించేందుకు కర్నూలుతో పాటు.. ఎమ్మిగనూరులో కూడా విక్రయాలు చేపడుతోంది ఏపీ మార్క్‌ఫెడ్. అయితే వరుసగా రెండు రోజులు మార్కెట్ మూసివేయడం వల్ల.. మళ్లీ కర్నూలులో ఉల్లి రాశులు పెరిగిపోయాయి.

ప్రభుత్వ సాయం – రూ.50 వేల నగదు

ఈ కఠిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి రైతుల నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రతి రైతుకు రూ.50 వేల నగదు సాయం అందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఉల్లి రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై దాదాపు 100 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ రైతుల కష్టసుఖాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రైతుల్లో ఆనందం

ప్రభుత్వ ప్రకటన వెలువడగానే రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మా కష్టం వృథా కాలేదు. అయినా కొంత ఆర్థిక సాయం అందితే మళ్లీ పంట సాగు చేయగలం అని పలువురు రైతులు భావోద్వేగంతో స్పందించారు. అయితే మార్కెటింగ్‌లో స్థిరమైన విధానం తీసుకురాకపోతే.. సమస్యలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

Also Read: భారతీయులకు అమెరికా బిగ్ షాక్..!

ఉల్లి రైతుల సమస్యలు కొత్తవి కావు. గిట్టుబాటు ధర లేక నష్టపోతూ వస్తున్న పరిస్థితుల్లో ఈసారి ప్రభుత్వం వెంటనే స్పందించి నగదు సాయం ప్రకటించడం అభినందనీయమైంది. తక్షణ ఉపశమనం లభించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఉల్లి ధరల నియంత్రణ, నిల్వ సదుపాయాల అభివృద్ధి, మార్కెట్ నియంత్రణ వంటి చర్యలు అవసరమని స్పష్టమవుతోంది. కానీ ప్రస్తుతం రైతులకు ఖాతాల్లోకి రానున్న రూ.50 వేల సాయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×