E-Paper
Advertisement

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!

West Godavari: సంక్రాంతి బరుల్లో కాసుల వర్షం.. రూ.లక్ష, 2లక్షలు కాదు.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న పందెంరాయుడు!
Advertisement

సంక్రాంతి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రవ్యాప్తంగా అంబరాన్నంటాయి. పండుగ పూట పిండివంటలు, కొత్త అల్లుళ్ల సందడి ఒకెత్తయితే.. కోడిపందేల హోరు మరో ఎత్తు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో ఈ ఏడాది పందేల జోరు మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుండటంతో పందెంరాయుళ్ల ఉత్సాహం గగనాన్ని తాకుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరి ఈ ఏడాది ఒక భారీ పందెంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా వేలల్లో, లక్షల్లో జరిగే పందేల కంటే భిన్నంగా, ఇక్కడ జరిగిన ఒకే ఒక్క పందెం ఏకంగా రూ.1.53 కోట్ల మార్కును తాకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు దిగ్గజ పందెంరాయుళ్ల మధ్య జరిగిన ఈ పోరు సంక్రాంతి బరుల్లోనే అత్యంత ఖరీదైన పందెంగా నిలిచింది.

Advertisement

గుడివాడకు చెందిన ప్రభాకర్, రాజమండ్రికి చెందిన రమేష్‌లు తమ పంతాన్ని నిగ్గుతేల్చుకోవడానికి తాడేపల్లిగూడెం బరిని ఎంచుకున్నారు. ఇరువురు తమ కోళ్లను అత్యంత జాగ్రత్తగా సిద్ధం చేసి రంగంలోకి దింపారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇరువైపులా భారీగా పందేలు కాశారు. చివరకు రమేష్‌కు చెందిన కోడి పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఈ ఒక్క పందెంతో రమేష్ ఏకంగా రూ.1.53 కోట్ల భారీ నగదును గెలుచుకున్నారు. ఇంత భారీ మొత్తం ఒకే పందెంలో గెలవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

కోడిపందేలు అంటే కేవలం కోళ్ల మధ్య పోరు మాత్రమే కాదు.. దీని వెనుక పెద్ద కసరత్తే జరుగుతోంది. పందెంరాయుళ్లు కోళ్ల బలాబలాలను తనిఖీ చేయడమే కాకుండా, ఖగోళ శాస్త్రం మరియు జ్యోతిష్యాన్ని కూడా గట్టిగా నమ్ముతున్నారు. కోడి రంగు (కాకి, డేగ, నెమలి, పర్ల), పందెం వేసే సమయం, ఆ రోజు నక్షత్రం వంటి అంశాలను బేరీజు వేసుకుని మరీ ముహూర్తాలు పెట్టుకుని కోళ్లను బరుల్లోకి దింపుతున్నారు. రమేష్ సాధించిన ఈ భారీ విజయం వెనుక కూడా ఇటువంటి వ్యూహాలే ఉన్నాయని పందెం ప్రేమికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో కూడా పందేలు జోరుగా సాగుతున్నప్పటికీ, గోదావరి జిల్లాల జోరు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. పోలీసుల ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ, సంప్రదాయం పేరుతో బరుల వద్ద కోట్లాది రూపాయల బెట్టింగులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం పందెం ఈ సంక్రాంతి సీజన్‌లోనే అతిపెద్ద ‘జాక్‌పాట్’గా నిలిచిపోయింది.

ALSO READ: Telangana: మానవత్వం చాటుకున్న రేవంత్ సర్కార్.. గల్ఫ్ కార్మికుడి మృతదేహం తరలింపుకు రూ. 1.50 లక్షల సాయం

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×