E-Paper
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన

Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్ష సూచన
Advertisement

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది.

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణించి రేపు  మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.

Advertisement

ఈ జిల్లాల్లో వర్షం.. 

వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి:

Advertisement

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి: ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

బాపట్ల, పల్నాడు, ప్రకాశం: ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

రాయలసీమ: రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా తుంపర్లు లేదా స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.. 

తీవ్ర వాయుగుండం దృష్ట్యా సంబంధిత జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. వర్షాలు కురిసే సమయంలో పాత భవనాల్లో ఉండేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని కోరారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ALSO READ: TATA Cars Discounts Jan 2026: టాటా జనవరి డిస్కౌంట్స్, ఆ కార్లపై ఏకంగా రూ. 85 వేల తగ్గింపు!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×