E-Paper
Advertisement

AP Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తుపాను.. ఏపీపై ఎఫెక్ట్ ?

AP Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో తుపాను.. ఏపీపై ఎఫెక్ట్ ?
Advertisement
AP Weather Update

AP Weather Update:

దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం (నవంబర్ 29) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మరోవైపు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కాగా.. ఇంకొక్క నెలరోజుల్లో పంట చేతికొస్తుందనగా.. అకాల వర్షసూచన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. వర్షాలు పడితే పంటంతా వర్షార్పణమైపోతుందని ఆందోళన చెందుతున్నారు. అక్కడక్కడా పడుతున్న వర్షాలతో.. కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి.. వాటిని ఆరబెట్టుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతన్న దిగులు చెందుతున్నాడు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×