E-Paper
Advertisement

APPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్‌-2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు..

APPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్‌-2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు..

APPSC : ఆంధ్ర ప్రదేశ్‌లో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17 అర్ధరాత్రి 11.59గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని.. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

గ్రూప్‌ 2 పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని.. వాటిని సరిచేయాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది ఏపీపీఎస్సీ.

మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ గతేడాది డిసెంబర్‌లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ముందుగా డిసెంబర్‌ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలపింది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు ఇబ్బంది పడడంతో.. గడువును జనవరి 17వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×