E-Paper
Advertisement

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి
Advertisement

APSRTC – Sankranti : సంక్రాంతి సంబురాలకు అన్ని గ్రామాలు ముస్తాభవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రజలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చేప్పింది.. సంక్రాంతి పర్వదినాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 10% రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఇందుకోసం రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్ల రేట్ల తగ్గింపు భారీ ఉపశమనం కలిగించనుంది.

సంక్రాంతి రద్దీని దృష్ట్యాలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 8 నుంచి 13 వరకు  3,900 స్పెషల్ బస్సు సర్వీసులు నడపనుండగా.. వీటిలో హైదరాబాద్ నుంచి 2,153 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే.. బెంగళూరు నుంచి  రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల కోసం రెగ్యులర్ బస్సులతో పాటుగా 375 బస్సులను నడపనున్నారు.

Advertisement

రాష్ట్రానికి ప్రయాణికుల్ని చేర్చడమే కాదు.. పండుగ అయిపోయన తర్వాత వారిని తిరిగి వారివారి గమ్య స్థానాల్లో దింపేందుకు సైతం ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయగా.. తిరుగు ప్రయాణం కోసం సైతం 3200 ప్రత్యేక బస్స సర్వీసుల్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. రాయితీ కావాలనుకునే వారు రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. అలాంటి టికెట్ల ధరలపై 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×