E-Paper
Advertisement

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి

APSRTC – Sankranti : ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడి
Advertisement

APSRTC – Sankranti : సంక్రాంతి సంబురాలకు అన్ని గ్రామాలు ముస్తాభవుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ప్రజలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చేప్పింది.. సంక్రాంతి పర్వదినాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో 10% రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఇందుకోసం రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్ల రేట్ల తగ్గింపు భారీ ఉపశమనం కలిగించనుంది.

సంక్రాంతి రద్దీని దృష్ట్యాలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 7,200 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 8 నుంచి 13 వరకు  3,900 స్పెషల్ బస్సు సర్వీసులు నడపనుండగా.. వీటిలో హైదరాబాద్ నుంచి 2,153 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే.. బెంగళూరు నుంచి  రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల కోసం రెగ్యులర్ బస్సులతో పాటుగా 375 బస్సులను నడపనున్నారు.

Advertisement

రాష్ట్రానికి ప్రయాణికుల్ని చేర్చడమే కాదు.. పండుగ అయిపోయన తర్వాత వారిని తిరిగి వారివారి గమ్య స్థానాల్లో దింపేందుకు సైతం ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేయగా.. తిరుగు ప్రయాణం కోసం సైతం 3200 ప్రత్యేక బస్స సర్వీసుల్ని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే.. రాయితీ కావాలనుకునే వారు రానుపోను టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలని సూచించింది. అలాంటి టికెట్ల ధరలపై 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×