BigTV English
Advertisement

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Lion attacked on Man in Tirupati:


తిరుపతిలో జూ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహం అరుపులతో ఆ వ్యక్తి భయంతో చెట్టు ఎక్కి.. అదుపు తప్పి కిందపడిపోయాడు. అది గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తిరుపతి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర జూ పార్క్‌ను రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌ సందర్శించడానికి వచ్చారు. సెల్ఫీ కోసం నిబంధనలు ఉల్లంఘించి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అందులోకి వెళ్లిన అతనిపై సింహం దాడి చేసింది. మెడ భాగంలో కొరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు . ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చినట్లు వారు గుర్తించారు.


వెంటనే అప్రమత్తమైన పార్క్‌ సిబ్బంది సందర్శకులను బయటకు పంపంది. అంతకు ముందే జూలో ఉన్న సందర్శకులకు సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×