E-Paper
Advertisement

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి

Lion Killed a man in Tirupati: తిరుపతిలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి
Advertisement

Lion attacked on Man in Tirupati:

తిరుపతిలో జూ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహం అరుపులతో ఆ వ్యక్తి భయంతో చెట్టు ఎక్కి.. అదుపు తప్పి కిందపడిపోయాడు. అది గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

తిరుపతి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర జూ పార్క్‌ను రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌ సందర్శించడానికి వచ్చారు. సెల్ఫీ కోసం నిబంధనలు ఉల్లంఘించి లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అందులోకి వెళ్లిన అతనిపై సింహం దాడి చేసింది. మెడ భాగంలో కొరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు . ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చినట్లు వారు గుర్తించారు.

వెంటనే అప్రమత్తమైన పార్క్‌ సిబ్బంది సందర్శకులను బయటకు పంపంది. అంతకు ముందే జూలో ఉన్న సందర్శకులకు సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×