BigTV English
Advertisement

AP: అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

AP: అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

AP: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నేడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.


గురువారం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల చేత నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు.

ఇతర పార్టీల నుంచి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


టీడీపీలో సీనియర్ నేతగా కొసాగుతున్న అయ్యన్న పాత్రుడు.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టిన ఏడాది 1983లో తొలిసారిగా నర్సీపట్నం నుంచి విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, గతంలో కంటే ఈసారి 24,756 ఓట్ల మెజారిటీతో నర్సీపట్నం ప్రజలు ఆయనను గెలిపించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆయన ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ గెలిచారు.

Also Read: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్..

గత ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యేవారు. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చేవారు. అంతేకాదు.. మంచి వాక్చాతుర్యమున్న వ్యక్తిగా ప్రజల్లో ఆయనకు పేరుంది. ఈ అన్ని అంశాల దృష్ట్యా సీఎం చంద్రబాబు.. స్పీకర్ పదవికి అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేశారు.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×