E-Paper
Advertisement

Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..

Balakrishna : టీడీపీ-జనసేన పొత్తు.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
Advertisement
Balakrishna latest news

Balakrishna latest news(Andhra pradesh political news today):

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. ఇరు పార్టీల నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన పొత్తు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పాలన నేరస్థులు, హంతకుల చేతిలో ఉందని విమర్శించారు.

ఇన్ని సీట్లు.. అన్ని సీట్లు కాదు టీడీపీ-జనసేన గెలవాలని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను, పవన్‌ కల్యాణ్‌ ముక్కుసూటిగా మాట్లాడుతామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ పాలన ఇష్టారాజ్యంగా సాగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని కోరారు. రాష్ట్రంలో ఒక్క హిందూపురంలో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు. పాలన చేతకాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

Advertisement

హిందూపురం ఆసుపత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు బాలయ్య. రోగుల ఫిర్యాదుపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను నిలదీశారు. గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లను నిరుపయోగంగా పడేశారన్నారు. ఆరోగ్యశ్రీని నిలిపేస్తామని ప్రైవేట్‌ ఆసుపత్రులు అంటున్నాయన్నారు.కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌ను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం రూ.460 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×