E-Paper
Advertisement

Balineni: బాలినేనికి మళ్లీ అవమానం!.. కావాలనే చేశారా?

Balineni: బాలినేనికి మళ్లీ అవమానం!.. కావాలనే చేశారా?
Advertisement
balineni

Balineni srinivasa reddy latest news(AP political news): మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. మాజీ అయినప్పటి నుంచీ వరుసగా అవమానాల పాలవుతున్నారు. జగన్ బంధువనే ప్రయారిటీ కూడా లేకుండా పోతోంది. ఎమ్మెల్యే మాత్రమే కావడంతో.. జిల్లాలో మంత్రి పెత్తనమే నడుస్తోంది. పార్టీలోనూ తన ప్రత్యర్థి వైవీ సుబ్బారెడ్డిదే హవా నడుస్తోంది. అధికారులెవరూ బాలినేని పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ జిల్లాకు వస్తే.. కనీసం హెలికాప్టర్ దగ్గరికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇదంతా సజ్జల డైరెక్షన్లో, వైవీ కనుసన్నల్లో, మంత్రి సురేశ్ ఆధ్వర్యంలో జరుగుతోందనేది బాలినేని భావన. అందుకే, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. జగన్ రెండుసార్లు బుజ్జగించారు. కొన్నాళ్లుగా కాస్త కామ్‌గా ఉంటున్నారు. తాజాగా, మరోసారి అవమానాల పాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రకాశంలో అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదాస్పదమైంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని విద్యాశాఖ అధికారులు ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే ఇందులో జిల్లా ఇంఛార్జి మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ దినేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు కనిపించలేదు. దీంతో నాలుక కర్చుకున్న అధికారులు.. దానిని తొలగించి వెంటనే మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ అధికారుల పనితీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement

అయితే, ప్రస్తుత ఫ్లెక్సీ ఘటనలో బాలినేనిని మాత్రమే టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలు కూడా మిస్ అయ్యాయి. గతంలో ఫ్లెక్సీలో తన ఫోటో లేనందుకు బాలినేని హర్ట్ అయ్యారు. మరి, ఈసారి అడ్జస్ట్ అవుతారా? మళ్లీ అలక పూనుతారా?

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×