B. C. Janardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిపై జగన్ వ్యవహరిస్తున్న ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఓడిపాయినా సైకో జగన్ కు బుద్ది రాలేదంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. దేశమంతా అమరావతి చట్టాన్ని బలపరుస్తుంటే.. జగన్, వైసీపీ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రాభివృద్దితో పాటు రాయలసీమ అభివృద్ధికి సైతం జగన్ ప్రధాన అడ్డంకిగా మారారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లిస్తే బంగారం పండిస్తారనే సిద్ధాంతంతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. గత ఐదేళ్లలో సీమపై చేసిన ఖర్చుపై చర్చకు రావాలని జగన్కు సవాల్ విసిరితే ఇంతవరకూ సమాధానం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. కేవలం 20 నెలల్లోనే రాయలసీమ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 8,000 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు.
రూ. 3,870 కోట్లు వెచ్చించి 738 కి.మీ. దూరం నుంచి కుప్పానికి సాగునీరు అందించామని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. మరోవైపు జగన్ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు పోయాని ఆరోపించారు. పులివెందుల ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చిన ఘనత కూడా ముమ్మాటికీ చంద్రబాబుదేనని అన్నారు. అవుకు రిజర్వాయర్ పనులను 3 నెలల్లోనే పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని తెచ్చారని ప్రశంసించారు. అయితే జీఓ 365 ద్వారా 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని మంత్రి ఆరోపించారు.
Also Read: ఇండియా vs చైనా.. రోజువారీ ఖర్చుల్లో తేడా ఏమిటీ? ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ?
‘నీరు-చెట్టు’ ద్వారా రాయలసీమలో చెరువులు, వాగులను బాగు చేసి సాగు విస్తీర్ణాన్ని కూటమి ప్రభుత్వం పెంచిందని మంత్రి పేర్కొన్నారు. ఓర్వకల్లు వద్ద లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి సీమ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన అల్ట్రాటెక్ వంటి పరిశ్రమ మళ్లీ ప్రారంభమవుతోందని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్ కట్టింది, ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమేని అన్నారు. తన హయాంలో ఓవరాల్ గా ప్రవేశపెట్టిన రూ. 12 లక్షల కోట్ల బడ్జెట్లో జగన్ కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమకు ఖర్చు చేయలేదని మంత్రి ఆరోపించారు. ఏడాదిన్నరలో కుందూనదిపై రిజర్వాయర్ కడతానన్న జగన్ మాట తప్పి రాయలసీమకు ద్రోహం చేశారని విమర్శించారు.
Also Read: టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!