E-Paper
Advertisement

Bhanu Prakash: తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరిక!

Bhanu Prakash: తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే వినాశనం తప్పదు.. వైసీపీ నేతలకు భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరిక!

Bhanu Prakash: హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల క్షేత్రాన్ని వైసీపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంపై టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ‘వైసిపి నాయకులకు ఒకటే చెబుతున్న తిరుమల చుట్టూ గిరిప్రదక్షిణ చేయండి పుణ్యం వస్తుంది.. తిరుమల చుట్టూ రాజకీయం చేస్తే రాజకీయ వినాశనం తప్పదన్నారు’. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గోశాలల నిర్వహణ నుండి గోవిందుడి దర్శనం వరకు ప్రతి విషయంలోనూ అపచారాలు జరిగాయని, స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడింది కల్తీ నెయ్యి అని సిట్ నివేదిక స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.

కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని.. దీనిపై సిట్ జరిపిన విచారణలో కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. అప్పన్న అనే వ్యక్తి ఖాతాలోకి 4 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఆవులే లేని ‘డోలే బాబా’ వంటి కంపెనీల నుండి నెయ్యిని ఎలా సేకరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేయడమే కాకుండా.. హిందూ వ్యతిరేక పాలన సాగించారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక జగన్ మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు రాష్ట్రపతి పాలన కావాలని కోరడం హాస్యాస్పదమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలన్నీ తాడేపల్లి నుండి వస్తున్న ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రీ-ప్లాన్డ్ స్కెచ్ అని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు నోటిదూలతో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019 నుండి జరిగిన అపచారాలపై చర్చకు తాము సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

Also Read:  ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×