BigTV English
Advertisement

Anticipatory Bail : వైసీపీ నేతలకు ఊరట.. చంద్రబాబు నివాసం, పై దాడికేసులో ముందస్తు బెయిల్

Anticipatory Bail : వైసీపీ నేతలకు ఊరట.. చంద్రబాబు నివాసం, పై దాడికేసులో ముందస్తు బెయిల్

Anticipatory Bail for YSRCP Leaders : వైసీపీ నేతలకు ఏపీ హై కోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూలై 16వ తేదీ వరకూ వాళ్లను అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. తదుపరి విచారణను 16కు వాయిదా వేసింది.


2021, అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై కొందరు వ్యక్తులు రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడగా.. టీడీపీ నేతల ఫిర్యాదులతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డిలను అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మొత్తం ఐదుగురు పోలీసుల కస్టడీలో ఉన్నారు.

దాడులకు కారణమైన మరికొందరు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొందరు ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిలో అత్యధికంగా వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. ఈ కేసులోనే వైసీపీ కీలక నేతలకు ముందస్తు బెయిల్ మంజూరైంది.


Also Read : జనసేనానికి మరో బంపరాఫర్ ఇచ్చిన చంద్రబాబు

మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిందితుడిగా చేరుస్తూ.. పోలీసులు కోర్టుకు నివేదికను అందజేశారు. ఈ ఘటనపై టీడీపీ ముదునూరి సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకూ 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న వారందరినీ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిగిలిన వారు అజ్ఞాతంలో ఉండగా.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

Tags

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×