E-Paper
Advertisement

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్‌లో ప్రధాన అనుచరుడు అరెస్ట్

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్‌లో ప్రధాన అనుచరుడు అరెస్ట్
Advertisement

Kodali Nani: గడిచిన కొంతకాలంగా గుడివాడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ల నెట్‌వర్క్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్‌ను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ అండదండలతో వినోద్ గత కొంతకాలంగా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుడివాడ వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడులు నిర్వహించింది. పట్టణంలో కొంతకాలంగా వినోద్ ఆన్‌లైన్ వేదికగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ.. పెద్ద ఎత్తున యువతను ఈ వ్యసనంలోకి లాగుతున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 50 వేల నగదుతో పాటు, బెట్టింగ్‌ల కోసం ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

అరెస్ట్ అయిన కూనసాని వినోద్, మాజీ మంత్రి కొడాలి నానికి అత్యంత సన్నిహితుడని స్థానికంగా ప్రచారం ఉంది. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని సాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినోద్ వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? ఈ బెట్టింగ్ రాకెట్‌లో భాగస్వాములు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా, డిజిటల్ లావాదేవీల ద్వారా కూడా భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు ప్రాథమిక సమాచారం.

కేసు నమోదు చేసిన అనంతరం గుడివాడ వన్ టౌన్ పోలీసులు నిందితుడు వినోద్‌ను కోర్టుకు తరలించారు. అక్రమ బెట్టింగ్‌లు, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసు అధికారులు హెచ్చరించారు. గుడివాడలో బెట్టింగ్ మూలాలను పూర్తిగా పెకిలించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ అరెస్టుతో గుడివాడలోని బెట్టింగ్ ముఠాల్లో కలకలం రేగింది.

Advertisement

ALSO READ: Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×