BigTV English
Advertisement

AP Capital: అమరావతి గోతుల్లో లక్షల కోట్లు పోయాలా? మంత్రి బొత్సా కలకలం..

AP Capital: అమరావతి గోతుల్లో లక్షల కోట్లు పోయాలా? మంత్రి బొత్సా కలకలం..
Botsa amaravati

AP Capital: మంత్రి బొత్సా సత్యనారాయణ ఉన్నారే.. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చడం తీవ్ర విమర్శల పాలైంది. అయినా, ఆయన మారలేదు. ఇప్పుడు మళ్లీ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ చేశారు. లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి, అమరావతి గోతుల్లో పోయాలా? అంటూ మరోసారి కలకలం రేపారు.


అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. వారికి కౌంటర్‌గా మంత్రి బొత్సా మీడియా సమావేశం పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లాభపడినవారే తప్ప.. నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరన్నారు. గతంలో తాను అమరావతిని శ్మశానంతో పోల్చడాన్ని కూడా సమర్థించుకున్నారు.

“ఊరంటే శ్మశానం కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానంతో పోల్చా. నివాసయోగ్యం అయినందున అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నాం” అని బొత్స అన్నారు.


మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకుంటే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలు అవకాశమిస్తే.. ఆ ఛాన్స్‌ను ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తామని ప్రశ్నించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపైనా బొత్స స్పందించారు. విశాఖ రాజధాని సెంటిమెంట్‌ను ప్రజలు నమ్మలేదనే వాదనతో తాను ఏకీభవించనన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంపై తానే బాధ్యత వహిస్తానన్నారు మంత్రి బొత్సా.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×