BigTV English
Advertisement

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?

Vijayawada: పైన ఫోటోలో కనిపిస్తున్న నేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెదిరిపోయారు. ఏపీ-తెలంగాణ నేతలుగా విడిపోయారు. ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు. టీడీపీ-టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు వారంతా.


ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది అలనాటి ఓబులాపురం మైనింగ్ కేసు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. 2007లో ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయి. అప్పటి వైఎస్ఆర్ సర్కార్‌కు మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి గనులు దోచిపెడుతోందని ఆరోపిస్తూ నేతలంతా ఆందోళనకు దిగారు. అప్పట్లో ఆయా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

అందుకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం మంగళవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు ఆయా నేతలంతా. విచారణ జనవరి 8కి వాయిదా పడింది. న్యాయస్థానం ముందు హాజరైన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.


వీరితోపాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు.

ALSO READ:  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌‌‌పై ఏసీబీ కేసు నమోదు

ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నోరు విప్పారు. తామంతా స్నేహితులమని, గతంలో టీడీపీలో పని చేశామని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో ఉన్నా, అందరూ ప్రజాసేవలో ఉన్నామన్నారు. ఆ తర్వాత ఏపీ-తెలంగాణ రాజకీయాల గురించి చిన్నపాటి చర్చ జరిగినట్టు ఓ వార్త గుప్పుమంది.

తెలుగు రాష్ట్రాలకు గురుశిష్యులిద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులు అయ్యారని, నిజాయితీగా ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారట. దూకుడుగా వెళ్తున్నారంటూ మాట్లాడుకున్నారట. ప్రజా సేవ చేస్తే నాలుగు కాలాలపాటు ప్రజల మనసులో ఉండిపోతారని చెప్పుకుంటూ హాయిగా నవ్వుకున్నారు ఆయా నేతలంతా. ఆ తర్వాత నేతలంతా తమ వాహనాలు తిరిగి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు.

 

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×