E-Paper
Advertisement

Bus shelter : ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..

Bus shelter :  ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..
Advertisement

Bus shelter : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా పదే పదే ప్రకటనలు చేస్తోంది. నగరం నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ చాలా వేదికలపై ప్రకటనలు చేశారు. దసరాకు సీఎం వైజాగ్ కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

విశాఖకు రాజధాని రూపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వంపై అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మోడ్రన్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ను రూ. 40 లక్షలతో నిర్మించింది. ఈ బస్‌షెల్టర్‌ను త్వరలో ప్రారంభించాల్సి ఉంది.

Advertisement

ఈ బస్ షెల్టర్ తాజాగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. షెల్టర్‌ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్‌ వద్ద ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×