E-Paper
Advertisement

Bus shelter : ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..

Bus shelter :  ప్రారంభానికి ముందే.. విశాఖలో ఒరిగిపోయిన బస్ షెల్టర్..

Bus shelter : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రభుత్వం కొంతకాలంగా పదే పదే ప్రకటనలు చేస్తోంది. నగరం నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ చాలా వేదికలపై ప్రకటనలు చేశారు. దసరాకు సీఎం వైజాగ్ కు షిఫ్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

విశాఖకు రాజధాని రూపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వంపై అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మోడ్రన్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ ను రూ. 40 లక్షలతో నిర్మించింది. ఈ బస్‌షెల్టర్‌ను త్వరలో ప్రారంభించాల్సి ఉంది.

ఈ బస్ షెల్టర్ తాజాగా పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ ఖర్చుతో నిర్మించిన బస్ షెల్టర్ కుంగిపోవడంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. షెల్టర్‌ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆరోపించారు. కుంగిన షెల్టర్‌ వద్ద ఆందోళన చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×